ముంబై నేపథ్యంలోనే డ‌బుల్ ఇస్మార్ట్

47
- Advertisement -

రామ్, పూరీ కాంబోలో ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్‌గా డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. డ‌బుల్ ఇస్మార్ట్ క‌థ‌ ఎక్కువ‌గా ముంబై నేప‌థ్యంలోనే ఉంటుంద‌ని, షూటింగ్ కూడా ఎక్కువ భాగం అక్క‌డే జ‌ర‌గ‌నుంద‌ని టాక్. లైగ‌ర్‌తో డిజాస్ట‌ర్ అందుకున్న పూరీ, ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చాలా గ‌ట్టిగా ట్రై చేస్తున్నాడు. కాకపోతే ముంబై నేపథ్యం అనగానే ఈ సినిమా పై నెగిటివ్ ప్రచారం మొదలైంది.

ముంబై నేపథ్యంలో కథ అనగానే రెగ్యులర్ యాక్షన్ కథే ఉంటుంది. సో.. ఏ రకంగా చూసినా పూరి గత సినిమాలు లాగానే ఉంటుంది. కాబట్టి.. ఈ సినిమాతో హిట్ కొట్టడం కష్టమే అని టాక్ నడుస్తోంది. ఇక హీరో రామ్ పోతినేని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని గత కొన్ని రోజులుగా పుకార్లు జోరుగా సాగుతున్నాయి. స్కూల్ డేస్‌ నుంచే ఓ అమ్మాయితో రామ్‌కు పరిచయం ఉందట.

Also Read:తమన్నాకి రొమాన్స్ బాగా ఇష్టమట!

ఇంతకాలం ఈ జంట ఫ్రెండ్స్‌గా కొనసాగినట్టు, ఇప్పుడు పెళ్లి వైపుగా ఇద్ద‌రు అడుగు లేస్తున్నార‌ని అంటున్నారు. మరి పెళ్లి ఎప్పుడు? అని ఎవ‌రైనా రామ్‌ని అడిగితే మ‌న చేతుల్లో ఏముంటుంది.. కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని చెబుతూ వస్తున్నాడు. మరి పూరితో సినిమా పూర్తి అయ్యే లోపు రామ్ పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.

Also Read:పచ్చదనం పెంపు..ప్లాస్టిక్ నియంత్రణకు పాటుపడతాం

- Advertisement -