రేవంత్‌కు దూరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే!

17
- Advertisement -

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఎమ్మెల్యే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలలు గడుస్తున్న కనీసం సీఎం రేవంత్ రెడ్డి మొహం కూడా చూడలేదు. ఆనాడు రేవంత్‌ చేపట్టిన పాదయాత్రకు సైతం దూరంగా ఉన్న ఆ నేత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇదే వరంగల్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేవంత్ జపం చేస్తున్న తన స్టైలే వేరు అంటూ అసలు సీఎంను పట్టించుకోవడం లేదు దొంతి. అంతేగాదు సీఎంను ఎందుకు కలవాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రేవంత్ వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన దూరంగానే ఉన్నారు. దీంతో స్వపక్షంలోనూ విపక్షంగా మారిన దొంతి తన ఎత్తుగడ ఏంటో మాత్రం చెప్పడం లేదు.

వాస్తవానికి ములుగు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టగా నర్సంపేట మీదుగా మహబూబాబాద్‌కు పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా అక్కడ రేవంత్ రెడ్డిని మాధవరెడ్డి కాలు మోపనివ్వలేదు. ఎలాంటి ఏర్పాటు సైతం చేయకపోవడంతో నర్సంపేటను పక్కకుపెట్టి మహబూబాబాద్‌కు చేరుకున్నారు రేవంత్. ఎన్నికల ప్రచారంలో సైతం నర్సంపేటకు రాలేదు రేవంత్. అప్పటినుండే వీరిద్దరి మధ్య గ్యాప్ పెరగగా దానినే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు దొంతి. దీంతో అసలు మాధవరెడ్డి అసలు వ్యూహామెంటో తెలియక నేతలు తికమకపడుతుండగా మంత్రిపదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా దొంతి వ్యవహారం మాత్రం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:డ్రగ్స్‌పై పోరులో ముందుకురండి:కేతిరెడ్డి

- Advertisement -