గ్రీన్ ఛాలెంజ్‌: ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి

110
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా డా. స్వర్ణ దీపక్,డా. హిమబాల కలిసి ఫిల్మ్ నగర్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.స్వర్ణ దీపక్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, కాలుష్యం వల్ల అనారోగ్యం అయిన రోగులను ప్రతీ రోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాము అని చెట్లను పెంచడం వల్ల కాలుష్యం తగ్గి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -