కర్ణాటక హస్తగతం..డీకే గెలుపు

59
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదుచేసింది. సీనియర్ నేతలంతా గెలుపు జెండా ఎగురవేయగా కనకపుర నియోజకవర్గం నుండి నాలుగోసారి గెలుపొందారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్.గాలి జనార్థాన్ రెడ్డి పార్టీతో పాటు బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ని దాటేసిన కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.

సీట్లలోనే కాదు, ఓట్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ తన దూకుడు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 40 శాతం సీట్లు పెంచుకున్న కాంగ్రెస్.. ఓట్లలో కూడా అదే శాతాన్ని రాబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడిస్తోంది. ఇక సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన బీజేపీ ఓట్ల విషయంలో మాత్రం తన ఓటు బ్యాంక్ ను మాత్రం కాపాడుకుంది.

Also Read:Karnataka Results:కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

- Advertisement -