‘డీజే టిల్లు2’ హీరోయిన్ మార్పు కారణం అదేనా ?

163
- Advertisement -

ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ అనిపించుకున్న లిస్ట్ చూస్తే మొదటి ప్లేస్ లో ఉంటుంది డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ రచనతో విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. సిద్దు నే హీరో.. దర్శకుడు , హీరోయిన్ ఇద్దరూ మారారు.

ఈ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారు. తాజాగా కొంత షూట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా హీరోయిన్ ను మార్చేశారు. అనుపమ స్థానంలో ఇప్పుడు సెబాస్టియన్ మడోన్నా ను తీసుకున్నట్లు సమాచారం. అయితే సిద్దు ఈ సీక్వెల్ ను ఎక్స్ ట్రిమ్ రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అనుపమ కేరెక్టర్ తో కాస్త ఓవర్ రొమాన్స్ ప్లాన్ చేశాడట. దీంతో ఆమె ఈ సినిమా తనకి కరెక్ట్ కాదనే నిర్ణయానికొచ్చిందట.

నిజానికీ డీజే టిల్లు లో సిద్దు తర్వాత నేహా శెట్టి నే హైలైట్. సినిమాలో పల్చటి అందాలతో కుర్రకారుని బాగా ఎట్రాక్ట్ చేసింది. సినిమా రిలీజ్ తర్వాత మంచి క్రేజ్ అందుకొని వరుస ఆఫర్స్ అందుకుంది. మరి ఇప్పుడు సెబాస్టియన్ మడోన్నా నేహా శెట్టి ను మించి ఆకట్టుకుంటుందా ? ఆమె ను మ్యాచ్ చేస్తుందా ? చూడాలి. ఏదేమైనా అనుపమ తీసుకున్న నిర్ణయం సరైందని ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి…

రెండో పెళ్లికి సిద్దమైన మీనా….

ద్విపాత్రాభినయంలో సింబా….

ప్లాప్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్.. రీజన్ అదే !

- Advertisement -