కిస్‌ మీ మోర్ అంటున్న దిశా..!

141
disha
- Advertisement -

లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటాని. ఈ సినిమాలో తన నటనకు మంచి ఆదరణ లభించడంతో రెండో సినిమాతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ధోని బయోపిక్ ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ, కుంగ్‌ ఫూ యోగ, వెల్‌కమ్ టు న్యూయార్క్‌, బాఘి 2,భారత్ వంటి చిత్రాల్లో నటించింది మెప్పించింది. చలనచిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దిశా…తాజాగా కిస్ మీ మోర్ అంటూ హాట్ సాంగ్‌తో అదరగొట్టింది. దిశా డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి “ఏక్ విలన్ రిటర్న్స్”లో నటిస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా… ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదల కానుంది.

- Advertisement -