‘పుష్ప రాజ్’ కోసం బాలీవుడ్‌ బ్యూటీ..!

125
- Advertisement -

‘పుష్ప’ సినిమాతో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. బన్నీ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పుష్ప ది రైజ్ గత ఏడాది డిసెంబర్ లో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రికార్డుల మోత మోగించింది. దీంతో ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికరమైన టాక్‌ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ‘ఊ అంటావా మామ .. ఉ ఉ అంటావా మావా’ అనే ఐటమ్‌ సాంగ్‌ మరో బ్లాక్‌ బస్టర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం మొదట దిశా పటానీని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో సమంత వచ్చి చేరింది. ఈ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’లోను ఒక హాట్ హాట్ ఐటమ్ ను సుకుమార్ చేశారట. ఈ సారి మాత్రం దిశా పటానికే ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ పాటతో దిశా ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -