చిరుతో శ్రీనువైట్ల…ప్రత్యేక పాత్రలో మహేశ్!

385
Chiranjeevi Mahesh Babu
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈమూవీ తర్వాత చిరంజీవి ఎవరితో చేస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఉన్న సమాచారం మేరకు స్టార్ దర్శకుడు శ్రీను వైట్ల ఇటివలే చిరంజీవిని కలిశారట. చిరుకు శ్రీను వైట్ల ఓ కథ చెప్పడాని తెలుస్తుంది. కథ నచ్చడంతో పూర్తి కథను రెడీ చేయమని చెప్పాడట చిరంజీవి.

అయితే చిరుతో పాటు మహేశ్ బాబుకు కూడా ఈ కథ వినపించాడట దర్శకుడు. చిరంజీవి మహేశ్ లతో మల్టీస్టారర్ సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. ప్రస్తుతం శ్రీనువైట్ల పూర్తి కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ దర్శకుడు దూకుడు తర్వాత తీసిన సినిమాలు అన్ని ప్లాప్ లను మూటగట్టుకున్నాయి. ఏదైనా మంచి కథతో మళ్లీ ఫామ్ లో రావాలని అనుకుంటున్నాడు శ్రీనువైట్ల.

- Advertisement -