రామ్ గోపాల్ వ‌ర్మ క‌రోనా సాంగ్

380
rgv
- Advertisement -

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌యాంధోళ‌న‌ల‌కు గురి చేస్తున్న క‌రోనా వైర‌స్ పై వ‌ర్మ పాట పాడాడు. ఈసాంగ్ ప్రోమోను ఈ రోజు ఉద‌యం విడుద‌ల చేశాడు. అంద‌రూ చెవుల‌కు మాస్క్ లు వేసుకుని ఈసాంగ్ వినాల‌ని కోరారు. క‌నిపించ‌ని పురుగు అనే పాట‌ను వ‌ర్మ స్వ‌యంగా రాసి పాడారు. ఫుల్ వీడియో సాంగ్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

కాగా వ‌ర్మ విడుద‌ల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో వైర‌ల్ అవుతుంది. ట్రెండింగ్ 2లో ఈ సాంగ్ కొన‌సాగుతుంది. కాగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోఠి క‌రోనా పై ఓసాంగ్ రాశారు. ఈసాంగ్ కు చిరు, నాగార్జున, సాయి తేజ్, వ‌రుణ్ తేజ్ లు న‌టించారు. ఈసాంగ్ చూసిన వ‌ర్మ తాను కూడా క‌రోనా పై సాంగ్ రాస్తాన‌ని చెప్పారు. చెప్పినట్లే పాట రాసి పాడారు వ‌ర్మ‌.

- Advertisement -