నెక్ట్స్‌ ప్రాజెక్టుపై దృష్టిసారించిన రాజమౌళి!

76
mahesh
- Advertisement -

ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత దర్శకుడు రాజమౌళి….మహేశ్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత కాస్త రిలాక్స్ అయిన జక్కన్న ఇప్పుడు ఈ సినిమాపై దృష్టిసారించారు. తన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేస్ బాబు సినిమా కోసం స్క్రిప్టు పనులు ప్రారంభించాడట .

ఈ సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేయబోతున్నట్లు జక్కన్న ఇప్పటికే వెల్లడించారు. అడవి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జక్కన్న – మహేశ్‌ కాంబోలో వస్తున్న తొలిచిత్రం కావడంతో ఇద్దరికి ఈ ప్రాజెక్టు కీలకం కానుంది.

ఇక జక్కన్న సినిమాతో పాటు త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు మహేశ్. ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో మహేశ్‌ …రానున్న రోజుల్లో ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇవ్వనున్నారు.

- Advertisement -