ఆ రెండు సినిమాల‌పై స్పందించిన రాజ‌మౌళి..

245
ss-rajamouli
- Advertisement -

తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. తెలుగు లో విడుద‌లైన ప్ర‌తి సినిమాపై రాజ‌మౌళి స్పందిస్తుంటారు. ఇటివ‌లే విడుద‌లైన ఆ రెండు సినిమాల‌పై నేడు రాజమౌళి స్పందించారు. రెండు వారాల క్రితం విడుద‌లైన సమ్మెహనం సినిమాను లేటుగా చూశాన‌ని చెప్పారు. లేటుగా చూసినా కానీ మూవీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాన‌ని తెలిపారు. సుధీర్ బాబు, అదితి రావు హైద‌రీ చాలా బాగా న‌టించార‌న్నారు.

rajamouli

సినిమా మొత్తంలో సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని పొగిడారు. ఈసినిమాకు ద‌ర్శ‌కుడు మోహన‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విడుద‌లైన మొద‌టి రోజు నుంచే ఈమూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక నేడు విడుద‌లైన మ‌రో సినిమా ఏమైంది ఈన‌గ‌రానికి సినిమా కూడా చూశాన‌ని తెలిపారు.

sammohanam, e nagaraniki emayendi

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా కూడా చాలా బాగుంద‌న్నారు. తరుణ్ భాస్క‌ర్ సినిమాను చాలా అందంగా తెర‌కెక్కించార‌న్నారు. సినిమాలో కామెడి బాగుంద‌న్నారు. చిత్ర యూనిట్ కు అభినంద‌న‌లు అంటూ రాజ‌మౌళి ట్వీట్ చేశారు. ఈసినిమాను ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. ప్రిమియ‌ర్ షో నుండే ఈమూవీ సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాల‌ను తీసుకొచ్చే సినిమాలు తీస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్.

- Advertisement -