నాగ‌శౌర్యను ప‌రామ‌ర్శించిన ద‌ర్శ‌కేంద్రుడు..

276
Director Raghavendra
- Advertisement -

ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై ఉషా మూల్పూరి నిర్మాత‌గా, శంక‌ర్ ప్ర‌సాద్ మూల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం3 ఇటీవ‌లే వైజాగ్ షెడ్యూల్‌లో హీరో నాగ‌శౌర్యకి యాక్సిడెంట్‌కి గురికావ‌టం తెలిసిన విష‌య‌మే.. దీనికి సంబందించి నాగ‌శౌర్య 15 రోజులు బెడ్‌రెస్ట్‌లో త‌న నివాసం నందు వున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ రోజు నాగ‌శౌర్య నివాసానికి విచ్చేసి ప‌రామ‌ర్శించారు. కె.రాఘ‌వేంద్ర‌రావుతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.వి.య‌స్ ర‌వి కూడా నాగ‌శౌర్య‌ని ప‌రామ‌ర్శించారు.

Director Raghavendra

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు మాట్లాడుతూ.. నాగ‌శౌర్య చాలా మంచి కుర్రాడు, స్వ‌శ‌క్తితో త‌నేంటో ప్రూవ్ చేసుకున్న హీరోల్లో శౌర్య ఓక‌డు, సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. అలాంటి వాడికి యాక్సిడెంట్ అయింది అన‌గానే చాలా బాధ అనిపించింది. వెంట‌నే ఫోన్‌లో ప‌రామ‌ర్శించాను, కాని మ‌న‌సు ఓప్ప‌క డైర‌క్టుగా త‌న నివాసానికి వ‌చ్చాను. దేవుని ద‌య‌వ‌ల‌న త్వ‌ర‌లో కొలుకోవాల‌ని షూటింగ్‌లో చురుకుగా పాల్గోనాల‌ని కొరుకుంటున్నాను. నాగశౌర్య ఫ్యామిలి చాలా మంచి ఫ్యామిలి, వారంద‌రి ప్రేమ శౌర్యపై వుంటుంది. దేవుడు కృప వాళ్ళంద‌రికి వుంటుందని అశిస్తున్నాను.. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు బి.వి.య‌స్ ర‌వి మాట్లాడుతూ.. నాకు శౌర్య అంటే గౌర‌వం వుంది. ఇప్ప‌డుడున్న చాలా మంది యంగ్ హీరోల్లో శౌర్య ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్‌ని సాంతం చేసుకున్నాడు. అలాంటి శౌర్య కి ఇలా జ‌ర‌గ‌టం చాలా బాద‌గా అనిపించింది. ఈ రోజు త‌న నివాసంలో క‌లిసాము. ఆయ‌న‌కి వారి కుటుంబానికి మంచి జ‌ర‌గాల‌ని కొరుకుంటున్నాను..అని అన్నారు. ఇక ప్ర‌స్తుతం నాగ‌శౌర్య త‌న సాంత బ్యాన‌ర్‌లో చిత్రాన్ని చేస్తున్నాడు. ర‌మ‌ణ తేజ అనే నూత‌న ద‌ర్శ‌కుడ్ని పరిచ‌యం చేస్తున్నాడు.

- Advertisement -