సమంతకు ఆ హీరోనే కావాలంట..

238
-Samantha
- Advertisement -

విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అడ‌వి శేష్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంజా, రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాల్లో న‌టించి ఫేమ‌స్ అయ్యారు. ఆ త‌ర్వాత క్ష‌ణం మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. స‌స్పెన్స్ ధ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈచిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఆత‌ర్వాత గుఢాచారి చిత్రంతో మరో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న గూఢాచారి2 మూవీలో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయ‌న మ‌రో సినిమాలో అతిధి పాత్ర‌లో న‌టించేందుకు అంగీక‌రించ‌న‌ట్టు తెలుస్తుంది. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘బేబీ’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఒక విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు.

అయితే ఈచిత్రంలో ప్ర‌త్యేక‌మైన పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర‌కు ఎవ‌రిని సంప్ర‌దించాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుండ‌టంతో స‌మంత అడ‌వి శేష్ పేరును చెప్పింద‌ట‌. ఈపాత్ర‌కు అడ‌వి శేష్ స‌రిగ్గా సెట్ అవుతాడ‌ని సూచించింద‌ట‌. సినిమాలో ఆయ‌న పాత్ర నిడివి త‌క్కువ సేపు ఉన్నా మంచి గుర్తింపు వస్తుంద‌ట‌. దీంతో వెంట‌నే అత‌న్ని సంప్ర‌దించార‌ట చిత్ర‌యూనిట్. స్టోరీ విన్న అడ‌వి శేష్ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే అత‌ను షూటింగ్ లో పాల్గోన‌నున్నార‌ని స‌మాచారం.

- Advertisement -