కె .వి .రెడ్డి అవార్డు అందుకున్న క్రిష్…..

200
director krish recieves kv reddy award
- Advertisement -

‘యువకళావాహిని’ అధ్వర్యం లో రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె .వి .రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనం గా జరిగింది . మాజీ ముఖ్యమంత్రి ,గవర్నర్ కె .రోశయ్య చేతుల మీదుగా దర్శకుడు క్రిష్  కె .వి .రెడ్డి అవార్డు ను అందుకున్నారు . కె .వి .రెడ్డి తక్కువ చిత్రాలే తీసినా అన్నీ జన రంజకం గా రూపొందించారని …. ఆ చిత్రాలు తెలుగు వారి  హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయని రోశయ్య అన్నారు .
director krish recieves kv reddy award
తెలుగు చలన చిత్ర రంగానికి గౌరవాన్ని ఆపాదించిన దర్శకులలో  కె .వి .రెడ్డి  అగ్ర గణ్యుడని  సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు . ప్రపంచ చలన చిత్ర రంగానికి పాఠ్యఅంశం గా  నిలిచిన  అలనాటి చిత్రాలను పాఠ్య గ్రంధాలుగా నేటి దర్శకులు అధ్యయనం చెయ్యాలని అన్నారు .  కె .వి .రెడ్డి అవార్డు అందుకోవడమంటే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం తో సమానమని , అవార్డు గ్రహీత క్రిష్ పెరిగిన బాధ్యతతో మరింత మంచి చిత్రాలు చెయ్యాలని అన్నారు .
director krish recieves kv reddy award
తన  చిత్రం లోని డైలాగ్ లా ‘ జనం చూసేదే మనం సెయాల ‘  అనేదే  కె .వి .రెడ్డి గారు  అనుసరించిన విధానమని  అవార్డు గ్రహీత క్రిష్ అన్నారు . . ‘మాయాబజార్’ కు  సరితూగే  చిత్రం ఇంతవరకు రాలేదని ,  తోట రాముడు ను మించిన కమర్షియల్ హీరో లేడని అన్నారు  . చిత్ర నిర్మాణం లో కె .వి .రెడ్డి గారి స్ఫూర్తి తో…  తప్పటడుగులు వేసినా, తప్పుటడుగులు పడకుండా పయనిస్తానన్నారు .
director krish recieves kv reddy award
సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో కె .వి .రెడ్డి గారి తనయుడు కె .రామ చంద్రా రెడ్డి ,  డా .కె .వి .కృష్ణ కుమారి , గీతాంజలి , తమ్మారెడ్డి భరద్వాజ , బుర్రా సాయిమాధవ్ , జె .బి .రాజు , ‘ సంధ్య ఫిల్మ్స్’ రవి కనగాల, వై .కె .నాగేశ్వర రావు   పాల్గొన్నారు . ఈ సందర్భం గా ‘శృతిలయ ఆర్ట్స్ అకాడమీ’  ఆమని సమర్పణ లో కె .వి .రెడ్డి – క్రిష్ చలన చిత్ర సంగీత విభావరి ఆహుతులను అలరించింది.

- Advertisement -