ఎంపీ సంతోష్ కృషి అభినందనీయం- కె విశ్వనాధ్

569
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ చలనచిత్ర దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాధ్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో కదంబ మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..హరితహారం చాలా గొప్ప కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ ,ఎంపీ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమని.. అదేవిధంగా పర్యావరణం రాను రాను క్షిణిస్తోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని కె.విశ్వనాధ్ అన్నారు.

Director K Viswanath

ఎంపీ సంతోష్ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని భగీరథ ప్రయత్నం లా కొనసాగిస్తున్నారు చాలా అభినందనీయం వారు చేస్తున్న కృషిని అభినదిస్తున్న..పూర్వకాలంలో అశోకుడు చెట్లు నాటాడు అని ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించాయని చదువుకున్నాం. దీన్ని సీఎం కేసీఆర్ ఆచరణాత్మకంగా ప్రారంభించడం చాలా గొప్ప నిర్ణయం అభినందనీయం అని దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాధ్ తెలిపారు

- Advertisement -