దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి

264
dilsukh nagar
- Advertisement -

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థపై నేరం నిర్థారణ అయింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను దోషులుగా ఖరారు చేశారు. వారికి ఏ శిక్ష విధించేదీ సోమవారం (ఈనెల 26వ తేదీన) వెల్లడిస్తారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.

ఈ కేసులోని ఆరుగురు నిందితులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్‌, తహసీన్‌ అక్తర్‌, జియ ఉర్‌ రహమాన్‌, ఎజాజ్‌ షేక్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.

- Advertisement -