దిల్ రాజుతో మైత్రి కి చెడిందా?

150
- Advertisement -

ఇండస్ట్రీలో టాప్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆ నలుగురిలో ఆయన కీలకంగా ఉన్నారు. అయితే తనకున్న థియేటర్స్ తో డిస్ట్రిబ్యూటర్ గా మంచి పట్టు సాదించాడు దిల్ రాజు. ప్రస్తుతం రాజు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటుంటే ఆయన తమ్ముడు శిరీష్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటున్నారు. అయితే వచ్చే సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరో పక్క దిల్ రాజు విజయ్ ‘వారసుడు’ ని సంక్రాంతికి తెలుగులో భారీ రిలీజ్ చేస్తున్నాడు. దీంతో చిరంజీవి , బాలయ్య సినిమాలకు మైత్రి అడిగినన్ని థియేటర్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు దిల్ రాజు. ఇక చాలా ఏరియాల్లో మంచి థియేటర్స్ అన్ని తన సినిమా కోసం ముందే బుక్ చేసేశాడు దిల్ రాజు. దీంతో మైత్రి నిర్మాతలు దిల్ రాజు మీద కాస్త కోపంగా ఉంటున్నారని తెలుస్తుంది.

తాజాగా మైత్రి నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. కొత్త దుకాణం పెట్టుకొని తమ సినిమాలకు ఇకపై థియేటర్స్ సమస్య రాకుండా చేసుకునే పని చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ ఏడాదే మైత్రి నిర్మాతలు నవీన్ , రవి శంకర్ డిస్ట్రి బ్యూషణ్ స్టార్ట్ చేయడంతో దిల్ రాజుతో చెడిందని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి నిర్మాతలుగా అగ్ర స్థాయికి చేరుకున్న మైత్రి నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎలాంటి విజయం అందుకుంటారో ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

నాగార్జునతో రైటర్ ఫిక్స్ !

సంక్రాంతికి ఆరు సినిమాలు

క్రిస్మస్ సినిమాకు రీ షూట్లు ?

- Advertisement -