‘వారసుడు’ కు క్లీన్ యు

34
- Advertisement -

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల కంప్లీట్ ఎంటర్‌టైనర్ వారసుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది.

వారసుడు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. క్లీన్ యు సర్టిఫికేట్.. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చని సూచిస్తుంది. వారసుడు థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎస్ థమన్ అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ అందించారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత ఈ చిత్రానికి సహ నిర్మాతలు. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.వారిసు జనవరి 11న విడుదల కానుండగా .. వారసుడు జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -