మొక్కలు నాటిన రైతు బంధువు సమితి కమిటీ సభ్యులు..

139
Green Challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుంది.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు నిజమాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం కలిగోట్ గ్రామంలో నిజామాబాద్ జిల్లా రైతు బంధువు సమితి కమిటీ మెంబర్ డికొండ శ్రీనివాస్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత గొప్ప కార్యక్రమంలో తాము ఒక భాగమై మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని డికొండ శ్రీనివాస్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపారు.

- Advertisement -