సెప్టెంబ‌రు 1న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

36
- Advertisement -

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం సెప్టెంబ‌రు ఒక‌టో తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

సెప్టెంబరు 18న వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నిర్వహించే జంట మహా ధార్మిక కార్యక్రమాలకు టీటీడీలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 మరియు 26 మధ్య, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నవంబర్ 15 మరియు 23 మధ్య జరగనున్నాయి.

Also Read:నేరేడుపండుతో ఆరోగ్య ప్రయోజనాలు?

- Advertisement -