మైదానంలోకి అడుగుపెట్టనున్న ధోని..!

370
dhoni
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2020 సందర్భంగా మార్చి 2 నుంచి చెన్నై చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాడు మహీ. ఇప్పటికే సీఎస్‌కే తరపున సురేష్ రైనా,అంబటి రాయుడు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

రెండు వారాల పాటు ధోని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నారు. అనంతరం 19 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్‌ క్యాంప్‌లో పాల్గొననున్నాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌ ధోనికి ఎంతో ముఖ్యమైంది.

తిరిగి టీమిండియా జట్టులోకి ధోని రావాలంటే ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చి తీరాల్సిందే. దీనికి తోడు గతేడాది రన్నరప్‌గా నిలిచిన సీఎస్‌కే ఈసారి టైటల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్‌ని గెల్చుకున్న చెన్నై..ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. మార్చి 29న ముంబై వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది సీఎస్‌కే.

- Advertisement -