భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి–2’ విడుదలైన సమయంలో మరో సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ చేసినా బాహుబలి సునామి తట్టుకోవడం కష్టమే. కానీ, తమిళంలో మాత్రం ‘పవర్ పాండ్’ చిత్రం ‘బాహుబలి–2’ని తట్టుకుని నిలబడింది. హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాహుబలి-2 విడుదలయ్యాక కూడా వెనక్కి తగ్గడం లేదు. పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందించే పనిలో పడ్డాడట ధనుష్. ఫస్ట్ పార్ట్లో సీనియర్ నటుడు రాజ్కిరణ్ టైటిల్ రోల్ చేశారు. ధనుష్ అతిథి పాత్ర చేశారు. సీక్వెల్లో మామ రజనీకాంత్ను నటింపజేయాలని ధనుష్ అనుకుంటున్నారట.
రజనీకాంత్ మరోసారి కబాలి డైరెక్టర్ రంజిత్ పాతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. రజినీ మరోసారి డాన్గా నటించనున్న ఈ సినిమాలో ధనుష్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడనేది కోలీవుడ్ టాక్. కానీ ఇప్పటివరకు ఈ విషయమై ధనుష్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ అదే కానీ నిజమైతే తమిళనాడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చూసే ఛాన్స్ ఆ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్కి కలిగినట్టే!