ధర్మయోగి ధనుష్‌..

183
- Advertisement -

‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ మరో సెన్సేషనల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్‌ మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో చేస్తున్న క్యారెక్టర్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘నరసింహ’ చిత్రంలో రమ్యకృష్ణ పాత్రను పోలి వుంటుంది. విభిన్న కథాంశంతో, పవర్‌ఫుల్‌ క్యారెక్టరైజేషన్స్‌తో తమిళ్‌లో ‘కొడి’ పేరుతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని తెలుగులో ‘ధర్మయోగి’గా విడుదల చేస్తున్నారు. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ఈరోజు విడుదలైంది.

unnamed (4)

ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ – ”పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొడి’. తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ‘రఘువరన్‌ బిటెక్‌’ చిత్రంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ధనుష్‌ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు వున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెలుగులో ‘ధర్మయోగి’ పేరుతో విడుదల చేస్తున్నాం. ఇటీవల తమిళ్‌లో విడుదలైన ఆడియోకు, ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈరోజు ‘ధర్మయోగి’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. అన్నిచోట్ల నుంచి చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రం ఆడియోను ఈనెల మూడోవారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయ్యే ఈ చిత్రం మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ” అన్నారు.

ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

https://youtu.be/8TG5olXBIeg

- Advertisement -