సామాజిక అవగాహన కోసమే నానమ్మ పాట

403
- Advertisement -

మానవ సంబందాలు రోజు రోజుకు దిగజారుతున్న నేటి సమాజంలో ప్రతి ఇంట్లో పెద్ద మనసుల్ని కాపాడాలని ఎన్.ఆర్.ఐ లు జలగం సుధీర్ కుమార్ మరియు తన్నీరు మహేష్ లు ఒక కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి రచయిత / గాయకుడు మానుకోట ప్రసాద్ తో ఒక పాట రాయించి దసరా పండుగ రోజు డిప్యూటి ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ ఆలి గారి చేతుల మీదుగా విడుదల చేయించారు.

unnamed (5)

దేశం కాని దేశం లో ఉన్నా కూడా ఇక్కడి సమాజంలోని కొన్ని రకాల సమస్యలపై పోరాడుతున్న ఎన్.ఆర్.ఐ జలగం సుధీర్ ప్రయత్నం ను, మంచి పాట రాసిన మానుకోట ప్రసాద్ ను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ఎవరి ఇంట్లో వాళ్లు పెద్ద వాళ్లను గౌరవంగా చూసుకుంటే వృద్దాశ్రమంల అవసరం ఉండదని ఈ సందర్బంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.ఏ శ్రీనివాస్ గౌడ్, సబ్ రిజిస్టార్స్ రాష్ట్ర అద్యక్షుడు గోన విష్ను వర్ధన్ రావు, రెవెన్యు కమిషనర్ నదీం, ఏ.సి.బి అడ్వకేట్ సంకినేని వేణు లు పాల్గొన్నరు.

- Advertisement -