కెప్టెన్ మిల్లర్..సెకండ్ సింగిల్

21
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ‘కెప్టెన్ మిల్లర్’ సెకండ్ సింగిల్ క్రీనీడలే పాటని ని విడుదల చేశారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం హార్ట్ టచ్చింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. రాకేందుమౌళి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. సింగర్ జావేద్ అలీ చాలా లైవ్లీగా అలపించారు. ఈ పాటలో ధనుష్, ప్రియాంకా అరుళ్‌ మోహన్ కెమిస్ట్రీ ని ప్రజెంట్ చేసిన విధానం చాలా ఎట్రాక్టివ్ గా వుంది.

1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.

ఈ చిత్రం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.‘కెప్టెన్ మిల్లర్’ ‘2024 సంక్రాంతికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Also Read:TTD:సంతృప్తిక‌రంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

- Advertisement -