- Advertisement -
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఇవాళ పలువురు దర్శించుకున్నారు. కేంద్ర సహాయమంత్రి దేవ్సిన్హ చౌహాన్తో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.సతీసమేతంగా ఆలయానికి వచ్చినకేంద్ర సహాయ మంత్రి దేవ్సిన్హ చౌహాన్ యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం చౌహాన్ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. అనంతరం ఆయన ఆలయ నిర్మాణాలను పరిశీలించారు.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
- Advertisement -