గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న టి పద్మారావు గౌడ్

200
padmarao
- Advertisement -

తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం విరిగా మొక్కలు నాటేలా చైతన్యం తీసుకొస్తున్నారు.

ఎంపీ సంతోష్ కుమార్ గారి కృషి అభినందనీయం . గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇదే స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపును ఇచ్చారు. ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం ద్వారా యావత్ తెలంగాణ, యావత్ భారత దేశం పచ్చదంగా మారాలని, సంతోష్ కుమార్ గారు కన్న కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -