ఢిల్లీ వైద్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్..

190
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే మొదటిసారి జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రాగా, రెండోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. సత్యేంద్రజైన్ ను తీవ్ర జ్వరం, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.

ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్‌గా రిపోర్ట్‌లో నిర్దారణ అయింది. 55 సంవత్సరాల సత్యేంద్రజైన్ ప్రస్తుతం అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఢిల్లీలోముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు, అతిశి, విశేష్ రవి, రాజ్ కుమార్ ఆనంద్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -