ఢిల్లీలో 24 గంటల్లో 7830 కరోనా కేసులు..

154
delhi
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ కొనసాగతుతుండగా రోజుకు 7 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 7,830 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 83 మంది చ‌నిపోయిన‌ట్లు ఢిల్లీ వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు 4,51,382 పాజిటివ్ కేసులు నమోదుకాగా 7,143 మంది మృతి చెందారు. 24 గంటల్లో 59,035 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలు దాటాయి. గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రోనా కేసులు న‌మోదుకాగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 86,36,012కు చేరింది.ప్రస్తుతం దేశంలో 4,94,657 యాక్టివ్ కేసులుండగా 80,13,784 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,27,571 మంది మృతిచెందారు.

- Advertisement -