రహానే,ధావన్ హాఫ్ సెంచరీ…ఢిల్లీ గెలుపు

172
rcb
- Advertisement -

ఐపీఎల్‌ 2020లో భాగంగా అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్‌. కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఢిల్లీ గెలుపొందింది. ఆర్సీబీ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 154 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీ షా 9 పరుగులు మాత్రమే చేసి ఔటైనా మిగితా వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు ధావన్, రహానే. ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించారు. ధావన్ 41 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసి ఔటైనా మిగితా పనిని పూర్తి చేశారు రహానే. 5 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో రహానే 60 పరుగులు చేయగా స్టాయినిస్ 10 , పంత్ 8 , శ్రేయాస్ అయ్యార్ 7 పరుగులు చేసి ఢిల్లీని గెలిపించారు.

ఐపీఎల్ 2020లో భాగంగా కీలక మ్యాచ్‌లో చేతులేత్తేశాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పేలవ ప్రదర్శన కనబర్చడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 152 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌(50: 41 బంతుల్లో 5ఫోర్లు) రాణించగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(29), ఏబీ డివిలియర్స్‌(35) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. దీంతో భారీ స్కోరు చేయడంతో ఆర్సీబీ విఫలమపంది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే(3/33), రబాడ(2/30) బెంగళూరును భారీ దెబ్బకొట్టాడు.

- Advertisement -