ఆ దర్శకుడు ఓ పనిరాక్షసుడు అట

46
- Advertisement -

దర్శకరత్న దాసరి నారాయణ రావు నిజమైన శ్రమజీవి. సినిమా ఇండస్ట్రీలో వందల మందికి పని కల్పించి, ఎంతోమందికి బతుకునిచ్చిన గొప్ప దర్శకుడు. దాసరి నారాయణ రావు ఏమి చేసినా ప్రత్యేకతే. ముఖ్యంగా దాసరి లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. ప్రతి రోజూ రాత్రి రెండు గంటల వరకు స్క్రిప్ట్ రాసుకునేవారు. పైగా తను రాయడంతో పాటు తానూ చేసే ప్రతి సినిమాకీ నలుగురు రైటర్లని పెట్టుకునే వారు. దాసరి నారాయణ రావుకి రాయడం చేతకాక కాదు, ఆయన రైటర్స్ ను పెట్టుకునేది, స్క్రిప్ట్ కి ఆయన ఇచ్చే విలువ అది. ఆయన దృష్టిలో సినిమా అంటే.. టీమ్ వర్క్. అందుకే నలుగురు రచయితల చేత రాయించేవారు.

అలాగే దాసరి నారాయణ రావు గారు కూడా ఓ వైపు రాస్తూనే ఉండేవారు. అర్ధరాత్రి అంతా అలా స్క్రిప్ట్ గురించే హెవీ డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి. పైగా పొద్దునే అందరి కంటే ముందే లేచి, నలుగురు రచయితలు రాసిన వాటినీ చూసి.. అందులో ఏది బాగుంటే అది తీసుకొని వారికీ ఎక్కువ రెమ్యునరేషన్ ఇప్పించేవారు. కట్ చేస్తే షూటింగ్ టైం అయిపోయేది. ఇక టిఫిన్ కూడా చేయకుండా హడావిడిగా అన్ని చూసుకుని ఓ సీన్ ఫైనల్‌ చేసి, ఆ పేపర్‌ నే స్పాట్‌ లోకి తెచ్చి మళ్ళీ మార్పులు ఏమి చేయకుండా ఎంతో వేగంగా షూట్ చేసేవాడు దాసరి. దీనిబట్టి షూటింగ్ జరుగుతున్నంత సేపూ ‘దాసరి నారాయణ రావు’కి సరిగ్గా నిద్ర ఉండేది కాదు.

అసలు, ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంతలా కష్టపడుతున్న వారు మరొకరు ఆ రోజుల్లో లేరు అంటే.. అతిశయోక్తి కాదు. అందుకే, అప్పటి నటీనటులు దర్శకరత్న దాసరి నారాయణ రావు గురించి మోటుగా ఒక్క మాట చెప్పుకుంటూ ఉండేవారట. గొడ్డులాగా కష్టపడతాడు, పనిరాక్షసుడు అంటూ ‘దాసరి నారాయణ రావు’ గురించి కథలు కథలుగా చెప్పేవారట. ‘దాసరి నారాయణ రావు’కి ఇలాంటి బిరుదులు రావడానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే… ఆయన చేతిలో మైక్ పట్టుకుని యాక్షన్ అన్నాక, ఇక ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. అలా చాలాసార్లు అర్ధరాత్రి రెండింటికి షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పిన సందర్భాలు కూ కోకొల్లలు ఉన్నాయట. అందుకే ‘దాసరి నారాయణ రావు గారు’ పనిరాక్షసుడిగా ముద్ర పడిపోయారు. బహుశా అందుకే ఆయన దర్శకరత్న అయ్యారు.

Also Read:రక్తపోటుతో ఎన్ని ప్రమాదాలో..!

- Advertisement -