సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ దసరా కానుక

95
- Advertisement -

సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుకగా తీపి కబురు ప్ర‌క‌టించారు. అర్హులైన కార్మికుల‌కు రూ. 368 కోట్ల‌ను సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది. ద‌స‌రా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని సీఎం ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ సంస్థ 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను.. సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. ఈ మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాలి అని అదేశించారు. ఈ మేరకు  సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లు సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

 

- Advertisement -