ప్రో క‌బ‌డ్డీ చాంపియన్‌గా దబాంగ్‌ ఢిల్లీ..

111
- Advertisement -

గత కొన్న రోజులుగా జరుగుతున్న ప్రో క‌బ‌డ్డీ 8వ సీజ‌న్ శుక్రవారం ముగిసింది. ఈ సీజన్‌ దబాంగ్‌ ఢిల్లీ చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఢిల్లీ 37-36 స్కోరు తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. ఢిల్లీ టైటిల్‌ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.

ఢిల్లీ స్టార్‌ రైడర్‌ నవీన్‌ కుమార్‌ (13), ఆల్‌రౌండర్‌ విజయ్‌ (14) సూపర్‌ 10తో దుమ్ము రేపారు. మరోవైపు పట్నా తీవ్రంగా ప్రతిఘటించినా.. స్టార్‌ డిఫెండర్లు మహ్మద్‌రెజా, సునీల్‌ పదేపదే తప్పిదాలు చేయడంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇరుజట్ల రైడర్లు పాయింట్లు దక్కించుకోవడంతో మ్యాచ్‌ ఆరంభం నుంచే ఉత్కంఠ రేపింది.

- Advertisement -