- Advertisement -
అక్రమంగా పాకిస్ధాన్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో ప్రశాంత్ అనే హైదరాబాద్ కుర్రాడిని పాకిస్ధాన్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రశాంత్ పాకిస్ధాన్ నుంచి విడుదలై క్షేమంగా హైదరాబాద్ కు తిరిగి వస్తాడని చెప్పారు.
ఏప్రిల్ 29, 2017 లో మాదాపూర్ పీయస్ మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు తెలిపారు. ప్రశాంత్ ప్రస్తుతం పాకిస్ధాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రశాంత్ ఎలా భారత సరిహద్దు దాటి పాకిస్థాన్ వెళ్ళాడో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాకిస్ధాన్ ఎంబసీతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
Cyberabad Cp Sajjanar Pressmeet About hyderabad Man Prashanth Arrested in Pakistan..
- Advertisement -