స్వచ్చభారత్ మిషన్ పై సీఎస్ రివ్యూ…

156
somesh kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 10,500 ప్రజా మరుగురోడ్లను ఆగస్టు 15 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు.గురువారం కేంద్ర గృహ , పట్టణ వ్యవహరాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ను నిర్వహించారు.

రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ , అమృత్ , సామార్ట్ సిటీ , ప్రధాన మంత్రి అవాస్ యోజన తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 1000 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మంచలని లక్ష్యంగా పెట్టుకున్నామని , వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మోబైల్ టాయిలెట్లను అక్టోబర్ 2 న ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాంలోని 132 పట్టాణాలలో బయోమైనింగ్ ప్రాజెక్టులు ప్రారంభించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

FSSTP మోడల్ ను రాష్ట్రంలో అభివృద్ధి పరుస్తున్నామని దిని వలన ఆరోగ్యం మరియు పరిశుభ్రత మెరుగుపడుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం TS-BPASS ను అమలు చేస్తుందని, దాని వలన నగరాలు, పట్టణాలలో భవనాల అనుమతులలో పారదర్శకత ఏర్పడుతుందని అన్నారు.రాష్ట్రాంలో వీది వ్యాపారులు గుర్తించేందుకు వార్డు స్థాయి బృదం ఏర్పాటు చేయడం తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను బాగస్వామం చేస్తున్నామని, దీని ద్వారా 5 లక్షల వీది వ్యాపారులను గుర్తించడానికి లక్ష్యంగా నిరేంశించుకున్నట్లు ఆయన వివరించారు.పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -