కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ…కలెక్టర్లతో సీఎస్ సమీక్షా

182
- Advertisement -

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,ఐ.ఎ.ఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను కలెక్టర్లతో సమీక్షించారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో పనిజేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లoదరికి కోవిడ్ -19 వాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్ చేశారు.

వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే తగు చర్యలు చేపట్టుటకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. వాక్సినేషన్ ప్రారంభోత్సవానికి నిర్దేశించిన ప్రతి కేంద్రo లో అన్ని ఏర్పాట్లను సమన్వయ పరిచేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు.

ముందు జాగ్రత్త గా వాక్సినేషన్ ను రిజర్వులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. నెట్ వర్క్ ద్వారా ముందుగా నిర్ణయించిన లబ్దిదారులను జిల్లా యంత్రాంగం చే వాక్సినేషన్ కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ వాక్సినేషన్ కు చాలా ప్రాదాన్యత ఉన్నందున ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. మొదటి రోజు కొద్దిమంది లబ్ధిదారులనే వాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే విదంగా చూచి, ఆ అనుభవాలను బట్టి ప్రణాళిక చేసుకొని మరుసటి రోజు నుండి లబ్ధిదారులను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

- Advertisement -