భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించండి- సీఎస్‌

156
cs
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, వివిధ శాఖలలోని ఖాళీల వివరాలను సేకరించుటకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు మరియు కార్యదర్శులతో సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, 50 వేల పోస్టులను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా, అన్ని శాఖలు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలన్నారు. అధికారులు ఖాళీల వివరాలను నిర్ణీత ప్రోఫార్మాలో సమర్పించాలని ఆదేశించారు. ఈ వివరాలను క్రోడీకరించి ముఖ్యమంత్రికి సమర్పించవలసి ఉన్నదన్నారు. నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అవసరమైన మార్పులు మరియు సంస్కరణలను తీసుకురావడం ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. వివిధ శాఖలలోని ఖాళీలను భర్తీ చేయడానికి సరియగు మెకానిజాన్ని అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డి.జి.పి. మహేందర్ రెడ్డి , ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు చిత్రా రామచంద్రన్, శాంతి కుమారి, రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, రజత్ కుమార్ , జయేష్ రంజన్ , రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -