Pawan Kalyan:పవన్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్

30
- Advertisement -

తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో పవన్‌ కళ్యాణ్, సాయితేజ్ నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో చేస్తున్న ‘వినోదయ సిత్తం’ రీమేక్ ‌షూటింగ్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సముద్రఖని.. ‘థాంక్యూ గాడ్, పవన్ కళ్యాణ్ సార్‌కి సంబంధించిన షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసాము’ అంటూ ఒక సెట్‌లోని పవన్ ఫోటో షేర్ చేశాడు.

అంతేకాదు ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చింది. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే.. పవన్ ఫ్యాన్స్ మొదటి నుంచి ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి జులై 28న విడుదల అవుతున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

అన్నట్టు యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ మరియు బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ హాస్య నటుడు అలీ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ప్రియా ప్రకాష్ – కేతిక శర్మ షూట్ లో కూడా పాల్గొననున్నారు. ‘శంభో శివ శంభో’ సినిమా తర్వాత డైరెక్టర్ సముద్రఖని నుంచి రాబోతున్న డైరెక్ట్ సినిమా ఇదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -