తెలంగాణలో క్రాకర్స్ బ్యాన్.. హైకోర్టు అదేశం…

171
Crackers banned
- Advertisement -

కారోనా నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు న్యాయవాది ఇంద్రప్రకాష్. తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతరని.. క్రాకర్స్ వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ పేర్కొన్నారు.

దీంతో పిటీషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని అదేశించింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలని హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందన్న హైకోర్టు.. కలకత్తాలో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచిందని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా క్రాకర్స్ బ్యాన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఎవ్వరు క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దని.. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు అదేశించింది. ఈ నెల 19న ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.

- Advertisement -