కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సీపీఐ నారాయణ

151
narayana
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదేనని తెలిపిన నారాయణ…ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి కేవలం ఐదుగురికి మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది. హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సి.పి. సజ్జనార్ లు మాత్రమే హకీంపేట విమానాశ్రయానకి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది.

- Advertisement -