సీపీ సజ్జనార్‌కు అవార్డును అందజేసిన మంత్రి కేటీఆర్..

159
ktr
- Advertisement -

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ప్రతిష్టాత్మకమైన ఐసీయూ అవార్డు లభించింది. ఈ అవార్డును మంత్రి కేటీఆర్….సీపీ సజ్జనార్‌కు అందజేశారు. కరోనా సమయంలో ప్లాస్మా దానంపై విస్తృత ప్రచారం చేసినందుకు 28వ యాన్యువల్ ఐసియా ఇన్నోవేషన్ సమ్మిట్ అవార్డును ప్రధానం చేశారు.

ప్లాస్మా దానం పై విస్తృత ప్రచారం చేయడంతో పాటు ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసి ప్లాస్మా దాతలను ప్రోత్సహించిన నేపథ్యంలో సీపీ సేవలపై సర్వత్రా ప్రశంసలు గుప్పించారు.

ప్లాస్మా డొనేట్ పై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు సెలబ్రిటీలతో కలిసి ప్లాస్మా దానంపై అవగాహన కల్పించారు. అంతేగాదు సెలబ్రిటీలు కూడా ఫ్లాస్మా దానం చేసేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. ఫ్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందించారు. ఈ నేపథ్యంలోనే సజ్జనార్‌కు ఐసీయూ అవార్డు వరించింది.

- Advertisement -