ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

12
- Advertisement -

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగగా రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు.

మాజీ ఉప రాష్ట్రపతులు జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీ రాధాకృష్ణన్​ను ఎన్డీఏ కూటమి రంగంలోకి దింపగా, ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి పోటీ చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో సీపీ రాధాకృష్ణన్‌ తన ప్రత్యర్థిపై 152 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Also Read:TTD:16న పవిత్రోత్సవాలకు అంకురార్పణ

- Advertisement -