కొవిడ్ టాస్క్‌ ఫోర్స్ కమిటీ సమావేశం…

144
ktr
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ్లి నుండి రాష్ట్రంలో లాక్ డౌన్‌ అమల్లోకి రాగా ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న తాత్కాలిక స‌చివాల‌య భ‌వ‌నంలోని సీఎస్ కార్యాల‌యంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశ‌మైంది.

ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం వంటి వాటిపై ఈ కమిటీ చర్చించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్,

పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -