దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య..!

231
COVID-19
- Advertisement -

దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 46,711కు చేరింది. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 31,967, మృతుల సంఖ్య 1,583, డిశ్చార్జి అయిన వారు 13,160 మంది కాగా మైగ్రేటెడ్ ఒకటి అని ఆయన తెలిపారు. అయితే కరోనా కేసులకు సంబంధించిన వివరాలు కొన్ని రాష్ట్రాల నుంచి సరైన సమయానికి రావడం లేదని లవ్ అగర్వాల్ తెలిపారు.

ఇతర రోగాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, అత్యవసర కేసులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూడాలని ఆదేశించారు. కార్యాలయాలు ప్రారంభించే వారంతా తమ కార్యాలయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కచ్చితంగా చేపట్టాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉద్యోగులందరూ ఆరోగ్య సేతు యాప్‌లో రిజిష్టర్ చేసుకోవాలని అన్నారు.

- Advertisement -