లక్షా 18 వేలకు చేరుకున్న కరోనా కేసులు..

258
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగోపోతున్నాయి. గత 24 గంటల్లో 6088 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.

ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.18 ల‌క్ష‌ల‌కు చేరుకోగా 3583 మంది మృతిచెందారు. గ‌త 24 గంట‌ల్లో 148 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.

కరోనా నేపథ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో ఉన్న 80 శాతం బెడ్‌ల‌ను ఆగ‌స్టు 31 వ‌ర‌కు బుక్ చేసుకున్న‌ది. చికిత్స బిల్లుల‌పై ప్ర‌భుత్వమే ధ‌ర‌ల‌ను ఫిక్స్ చేసింది.

- Advertisement -