ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదు..

211
corona
- Advertisement -

ఏపీలో నిన్న తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఈరోజు మళ్లీ కొంత మేర పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 685 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా గణాంకాలతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8,68,749కి చేరింది. మొత్తం మరణాలు 6,996కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 1,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 146, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నలుగురు వ్యక్తులు కరోనా వల్ల మృతి చెందారు.

- Advertisement -