మున్సిపల్,కార్పొరేషన్ ఎన్నికలకు సిద్దం..

185
ec
- Advertisement -

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, నకేరేకల్,అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మరికొన్ని మున్సిపలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు ఆకస్మిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిoదని, ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ మరియు పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యేవరకు ప్రతి అంశంలో అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్ధసారధి అన్నారు.

 బుధవారం (7-4-2021) సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థల), మున్సిపల్ కమీషనర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైందని, కమీషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు.

 రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సాదారణ ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి, సూచనలు, నియమావళి రూపొందించి ప్రచురించడం జరిగిందని, అవే సూచనలు, నియమ నిభందనలు ప్రస్తుతం ఎన్నికలకు వర్తిస్తాయని, ఈ సుచనలకనుగుణoగా ఎన్నికలు నిర్వహించేలా CDMA పర్యవేక్షిస్తారన్నారు.

 ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇండేలిబుల్ ఇంకు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి CDMA పర్యవేక్షిస్తారన్నారు.
 జనవరి 1వ తేదీ వరకు అర్హతగల ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం 15-1-2021 న ప్రచురించడం జరిగిందని, అట్టి జాబితాను Te-Poll సర్వర్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచడం జరిగిందని, అట్టి జాబితాను ఉపయోగించుకొని ఏప్రిల్ 5వ తేదీన ముసాయిదా వోటరు జాబితా ప్రచురించడం జరిగిందని, దానిపై అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్ 11వ తేదీన తుది వోటరు జాబితా వార్డు వారీగా ప్రచురించాలన్నారు.

 పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, వీలైనంతవరకు గతంలో ఉపయోగించిన పోలింగ్ స్టేషన్లనే వాడుకునేలా చూడాలని, ఏప్రిల్ 14వ తేదీన పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురించాలన్నారు.

 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితా ఏప్రిల్ 7వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల అధికారి (CDMA) కి సమర్పించాలని, అట్టి జాబితాలను రాష్ట్ర ఎన్నికల అధికారి 8వ తేదీ లోపు ఆమోదించి జిల్లా కలెక్టర్లకు పంపాలన్నారు.

 రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఏప్రిల్ 12వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేయాలన్నారు.

 బ్యాలట్ బాక్సులను అవసరం మేరకు పరిశీలించి తయారుగా ఉంచుకోవాలని, అవసరం మేరకు మరమ్మత్తులు జరిపి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.

 వార్డు వారీ బ్యాల్లట్ పేపర్ ముందుగా అంచనా వేసుకొని బ్యాలట్ పేపర్ ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్లను గుర్తించి, పోటీ చేయు అభ్యర్థుల జాబితా సిద్దమైన వెంటనే తగు బందోబస్తు ఏర్పాట్లు చేసుకొని ముద్రించుకోవాలని తెలిపారు.

 ఎన్నికల నిర్వహణసజావుగా, స్వేచ్చాయుత వాతావరణం తో ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధితపోలీస్ ఆధికారులతో చర్చించి బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.

 ఎన్నికల సందర్బంగా ఆదర్శ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, సాధారణ ఎన్నికలు నిర్వహించే స్థానిక సంస్థలలో ఆయా మున్సిపల్ కార్పొరేషన్, నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ పరిధిలో ప్రవర్తనా నియమావళి నోటిఫికేషన్ తేదీనుండి వర్తిస్తుందని, ఆకస్మిక ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీలలో ఆ మొత్తం మున్సిపాలిటీ పరిధిలో ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు.

 సాదారణ ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీలకు సాధారణ పరిశీలకులను, వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించడం జరుగుతుందని, ఆకస్మిక ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో సాధారణ, వ్యయ పరిశీలన కొరకు సంబంధిత కలెక్టర్లు తగిన అధికారులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

 ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో చేయవలసిన వివిధ పనులను, వాటిని పూర్తి చేయవలసిన తేదీలను సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టిక తయారు చేసి అందరు మున్సిపల్ కమీషనర్ లకు పంపడం జరిగిందని, సంబంధిత జిల్లా కల్లెక్టర్లు నిర్ణీత తేదీలలో ఆయా పనులు తుచాతప్పకుండా జరుగునట్లు చూడవలెనని కోరారు.

 కోవిడ్ -19 కు సంబంధించి ప్రత్యేకoగా సూచనలు జారీచేయడం జరిగిందని, వాటిని తప్పనిసరిగా పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు.

 ఈ సమావేశానికి కమీషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంబధిత జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గోన్నారు

- Advertisement -