కరోనా…అప్ డేట్స్

251
india coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటివరకు 24,506 పాజిటివ్ కేసులు నమోదుకాగా 779 మంది మృత్యువాత పడ్డారు.5192 మంది ఆస్పత్రి నుండి కొలుకోని డిశ్చార్జ్ కాగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో 301 మంది మరణించగా గుజరాత్‌లో 2,815 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇక ఢిల్లీలో 2514 కేసులు నమోదవగా, 53 మంది మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 955కి చేరగా 29 మంది మరణించారు.

మధ్యప్రదేశ్‌లో 1852 మంది ఈ వైరస్‌ బారిన పడగా, 92 మంది మృతిచెందారు. తమిళనాడులో 1755 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కి చేరింది.

- Advertisement -