రాష్ట్రంలో కొత్తగా 21 కరోనా కేసులు నమోదు..

303
Coronavirus in Telangana Latest Updates
- Advertisement -

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తాజా కరోనా కేసుల వివరాలు విడుదల చేసింది. ఈ రోజు కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన వాటితో మొత్తం కేసుల సంఖ్య 1082కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 29 మంది కరోనా వల్ల చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో ప్రస్తుతం 508 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాల జిల్లాలో ఒక కేసు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలో 545 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Coronavirus in Telangana Latest Updates

- Advertisement -