24 గంటల్లో 2,487 కొత్తగా కరోనా కేసులు..

226
coronavirus
- Advertisement -

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 2487 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 83 మరణాలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు ఈ వైరస్ భూతానికి బలైన వారి సంఖ్య 1306గా నమోదైంది. ఇవాళ 869 మంది డిశ్చార్జి కాగా, 28,070 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక, రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 12,296 కేసులు నమోదయ్యాయి. 521 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్ లో 5,055 మందికి కరోనా సోకగా, 262 మంది మరణించారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఓ మోస్తరు అదుపులో ఉన్నట్టే భావించాలి. ఏపీలో 58 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 6 కేసులు వెల్లడయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వెయ్యికిపై కేసులు నమోదయ్యాయి.

- Advertisement -